శాశ్వత సత్యాలు.. ~ దైవదర్శనం

శాశ్వత సత్యాలు..

ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం కలిగినపుడు ఎవరు తప్పు, ఎవరు రైటు అన్న ప్రశ్న ఒక్కటే తప్పు, మిగిలినదంతా రైటే.

 "ఒకడి మీద ఒకడు చిరాకు పడడం, ఎవరికి వారు వేరుగా పని చేసుకోవడం అనేవి ఏర్పడతాయి. ఈ విడిపోవడం సామాన్యంగా కొన్ని సంవత్సరాలు గాని, ఒక్కొక్కడికి ఆజన్మాంతం గాని ఏర్పడుతూ ఉంటాయి.

చిరాకు పడటంలో విషయం ఏమీ ఉండదు. చిరాకు పడడానికి ఎప్పుడూ పాయింటు ఉండదు. చిరాకుకు కారణం పనిలేని చిత్త వృత్తి. కనుక అది ఒక విధమైన వ్యాధి వంటిది.

 దానిని‌ నివారణ చేసుకొన్న వాడికి తప్ప మిగిలిన వారికి తన నిత్య జీవితం కూడా ఇబ్బందులతో నడుస్తుంది. ఇక మహాకార్యాలు సాధించడం అనేది ఉండదు.

 " నీకు గిట్టని వాళ్ళు, గిట్టని సిద్ధాంతాలు నశించటం సత్యం కాదు. కనుక అది ఎన్నటికి జరుగదు. వాటికి నీకు ఉన్న సంబంధం తెలుసుకొని, ఉండవలసిన సంబంధం ఏర్పరుచుకుంటే నీవు వాళ్ళని, వాటిని మలచ గల్గుతావు.

నీ కన్నా తక్కువ తెలిసిన వాళ్ళు నీ వెంట నడవాలంటే, నీవు నీ కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు అడుగుజాడలలో నడవాలి...
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List