శ్రీవారి కైంకర్యంలో తరించిన భక్తాగ్రేశ్వరుడు
శ్రీఅనంతాళ్వార్ వారు.
శ్రీఅనంతాళ్వార్ తిరుమలకొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించారు.
ఈయన శ్రీస్వామివారికి రోజూ పూలమాలలు సమర్పించేవారు.
తిరుమలలో పూలతోట వేసి, ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామివారికి సమర్పించేవారు.
అనంతాళ్వారులు తిరుమలలో పూలతోటకి నీళ్ల కోసం బావి తవ్వడానికి భార్యని సహకారం తీసుకున్నారు.
అనంతాళ్వారులు గునపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే, ఆయన భార్య ఆ మట్టిని తీసుకుని వెళ్లి
దూరంగా పోసి వచ్చేది.
అనంతాళ్వారులకు సహాయం చేయడానికి
శ్రీశ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి, అనంతాళ్వార్ ని
నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వారులు అంగీకరించలేదు.
బాలుడు అనంతాళ్వారులు భార్యకి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది.
ఆమె మట్టితట్టని తీసుకొనివెళ్ళి ఇస్తే, బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.
భార్య తొందర తొందరగా మట్టి తట్టలు తీసుకుని రావడం గ్రహించిన అనంతాళ్వారులు, భార్యని అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది.
ఆగ్రహించిన అనంతాళ్వారులు కోపంతో, చేతిలో ఉన్న గునపాన్ని బాలుని మీదకి విసురుతాడు.
అది వెళ్లి ఆ బాలుని గడ్డానికి తగులుతుంది.
ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోతే, అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు.
సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్.
అక్కడ శ్రీశ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావడం చూసిన అనంతాళ్వారులు, అయ్యో....! నేను గుణపం విసిరింది ఎవరిమీదో కాదు, సాక్షాత్తు శ్రీశ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చేయటానికి వచ్చాడు అని గ్రహిస్తాడు.
స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు.
అప్పటి నుంచి శ్రీస్వామివారి గడ్డం పై రోజు పచ్చకర్పూరం అద్దుతారు.
ఇప్పటికీ మనం అనంతాళ్వారులు శ్రీస్వామివారి మీద విసిరిన గునపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వేళ్ళాడుతూ ఉండడం చూడవచ్చు.
శ్రీఅనంతాళ్వార్ బృందావనం శ్రీవారిఆలయం వెనక వైపు ఉంటుంది.
మనం అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు.
శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీమలయప్పస్వామివారు సంవత్సరానికి ఒకసారి శ్రీఅనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు.
శ్రీఅనంతాళ్వార్ వారు.
శ్రీఅనంతాళ్వార్ తిరుమలకొండ మీద శ్రీవారి ఆలయానికి వెనుక వైపు నివసించారు.
ఈయన శ్రీస్వామివారికి రోజూ పూలమాలలు సమర్పించేవారు.
తిరుమలలో పూలతోట వేసి, ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజూ స్వామివారికి సమర్పించేవారు.
అనంతాళ్వారులు తిరుమలలో పూలతోటకి నీళ్ల కోసం బావి తవ్వడానికి భార్యని సహకారం తీసుకున్నారు.
అనంతాళ్వారులు గునపంతో బావి తవ్వుతూ మట్టిని తట్టలో పోస్తే, ఆయన భార్య ఆ మట్టిని తీసుకుని వెళ్లి
దూరంగా పోసి వచ్చేది.
అనంతాళ్వారులకు సహాయం చేయడానికి
శ్రీశ్రీనివాసుడు బాలుని రూపంలో వచ్చి, అనంతాళ్వార్ ని
నేను మీకు సహాయం చేస్తాను అంటే అనంతాళ్వారులు అంగీకరించలేదు.
బాలుడు అనంతాళ్వారులు భార్యకి సహాయం చేస్తాను అంటే ఆమె అంగీకరిస్తుంది.
ఆమె మట్టితట్టని తీసుకొనివెళ్ళి ఇస్తే, బాలుడు దూరంగా పోసి వచ్చేవాడు.
భార్య తొందర తొందరగా మట్టి తట్టలు తీసుకుని రావడం గ్రహించిన అనంతాళ్వారులు, భార్యని అడిగితే ఆమె బాలుడు సహాయం చేస్తున్నాడని చెప్తుంది.
ఆగ్రహించిన అనంతాళ్వారులు కోపంతో, చేతిలో ఉన్న గునపాన్ని బాలుని మీదకి విసురుతాడు.
అది వెళ్లి ఆ బాలుని గడ్డానికి తగులుతుంది.
ఆ బాలుడు అక్కడ నుంచి వెళ్ళిపోతే, అనంతాళ్వారులు మళ్ళీ బావి తవ్వే పనిలో నిమగ్నం అవుతారు.
సాయంత్రం చక్కగా పూలమాలలు అల్లి బుట్టలో పెట్టుకుని శ్రీవారి ఆలయానికి వెళ్తాడు అనంతాళ్వార్.
అక్కడ శ్రీశ్రీనివాసుని గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావడం చూసిన అనంతాళ్వారులు, అయ్యో....! నేను గుణపం విసిరింది ఎవరిమీదో కాదు, సాక్షాత్తు శ్రీశ్రీనివాసుడే బావి తవ్వటంలో సహాయం చేయటానికి వచ్చాడు అని గ్రహిస్తాడు.
స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరం అద్దుతాడు.
అప్పటి నుంచి శ్రీస్వామివారి గడ్డం పై రోజు పచ్చకర్పూరం అద్దుతారు.
ఇప్పటికీ మనం అనంతాళ్వారులు శ్రీస్వామివారి మీద విసిరిన గునపాన్ని మహాద్వారం దాటిన తర్వాత కుడి వైపు గోడకు వేళ్ళాడుతూ ఉండడం చూడవచ్చు.
శ్రీఅనంతాళ్వార్ బృందావనం శ్రీవారిఆలయం వెనక వైపు ఉంటుంది.
మనం అనంతాళ్వార్ బృందావనం దర్శించవచ్చు.
శ్రీవారి ఉత్సవమూర్తి అయిన శ్రీమలయప్పస్వామివారు సంవత్సరానికి ఒకసారి శ్రీఅనంతాళ్వార్ బృందావనం కి వెళ్తారు.






No comments:
Post a Comment