స్కాందపురాణంలో కార్తీక మాసం గొప్పదనం గురించి బ్రహ్మగారు నారదుడికి చెప్తారు. కార్తీక మాసానికి మరొక పేరు దామోదర మాసం. ఈ కార్తీకమాసానికి అధిదేవుడు దామోదరుడు. ఈ కార్తీక మాసంలో ఎవరు దామోదరుడుని(శ్రీకృష్ణ భగవాణుడు) ప్రతిరోజు అత్యంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, ప్రతిరోజు నేతితో చేసిన దీపంతో లక్ష్మీనాధుడిని ఆరాధిస్తారో, హరినామ స్మరణ చేస్తుంటారో, అటువంటివారికి ఇప్పటివరకు వారిని జన్మజన్మల యందు వెంటాడుతున్న దారిద్యం నశించి, అపారమైన భోగభాగ్యాలను, సిరిసంపదలను అపారంగా వర్షించటమేకాక, ఉత్కృష్టమైన మోక్షాన్ని అనుగ్రహింపచేస్తాడు శ్రీమన్నారాయణుడు.
కార్తీకమాసం ఎంతో పుణ్యప్రదమైన మాసం. మార్గశీర్ష మాసం తర్వాత అంత గొప్ప నెల ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే. దక్షణాయనంలో ఈ రెండు నెలలు పక్కపక్కనే వస్తాయి. ఈ రెండు నెలలో చేసే పూజలకు, దానాలకి ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది. అంత గొప్పదైన ఈ కార్తీకమాసానికి అధిదేవుడు దామోదరుడు. అంటే తాడుచేత ఉదరమునకు (పొట్ట) కట్టబడిన కృష్ణుడు.
*దామోదర లీల*
కార్తీకమాసంలో ప్రతిరోజూ దామోదరలీలను, దామోదర అష్టకాన్ని పారాయణ చేయమంటారు పెద్ధలు. భాగవతంలో ఇది ఒక గొప్ప లీల. చిన్ని కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడని తల్లి యశోద, కృష్ణుడిని ఒకతాడుతో రోటికి కట్టాలని చూస్తుంది. కానీ తాడు సరిపోదు. మళ్ళీ కొంచెం పెద్ద తాడు కడుతుంది. అయినా సరిపోదు. ఆలా ఎంత తాడు తీసుకొచ్చిన అయన మాత్రం కట్టుబడట్లేదు. సమస్త బ్రహ్మాండాలు అయన కడుపులోనే ఉన్నాయని తెలియని ఆ గోపస్త్రీ అయన పరమాత్మ అన్న విషయం తెలియక ఆయన్ని కట్టేయాలని చూస్తుంది. చివరికి అమ్మ అవస్థని చూసిన భగవానుడు, ఆమె ప్రేమకి లొంగి ఒక రోటికి బంధింపబడ్డాడు.
ఈ లీల జరుగుతుంటే చతుర్ముఖ బ్రహ్మగారు, పార్వతీ సహితుడైన పరమశివుడు, 33 కోట్లమంది దేవతలు, ఋషులు ప్రచ్ఛన్న వేశాలలో నందుడి ఇంటి చుట్టూ తిరుగుతూ చూస్తున్నారు. ఈ కంటికి కనపడని పరమాత్మ, ఒక జాతకర్మ అంటే తెలియనివాడు, అండ, పిండ, బ్రహ్మాండాలను సృష్టించిన పరాత్పరుడు భక్తికి లొంగి ఒక ప్రాకృత బాలుడు వలె అమ్మకి బయపడుతున్నవాడిలా నటిస్తున్న కృష్ణపరమాత్మని ఒక రోటికి బంధించింది. వేదాలకు దొరకనివాడు, లక్ష్మీదేవి కౌగిటికి దొరకనివాడు, యోగుల మనస్సులకు దొరకనివాడు, ఈరోజు తల్లిప్రేమకు బంధీ అయ్యాడని, లోకంలో ఎవ్వరికీ ఇటువంటి వరాన్ని ఇవ్వనివాడు కేవలం ఈ గోపాలవనితకి ఇచ్చాడని దేవతలంతా ముక్కున వేలేసుకున్నారు. ఆలా రోటికి కట్టబడిన బాలకృష్ణుడు, రోటీని లాక్కుంటూ, లాక్కుంటూ ఎప్పటినుంచో నారదుని యొక్క శాపానికి గురై రెండు మద్ది చెట్లుగా పడి ఉన్న కుబేరుడి యొక్క కుమారుల శాప విమోచనం గావించి వారికి తిరిగి పునర్వైభవాన్ని అనుగ్రహించాడు బాలకృష్ణుడు. అటువంటి ఇంత గొప్ప లీల ఈ కార్తీక మాసంలోనే చేసాడు పరమాత్మ. ఇప్పటికీ సమాధి స్థితిలో ఉన్న మహాయోగులు, పీఠాధిపతులు సైతం ఈ లీలని ధ్యానం చేస్తూ ఉంటారు.
భాగవతంలో చెప్పబడిన ఇంతగొప్ప లీలని కార్తీకమాసమంతా పారాయణ చెయ్యడం, కార్తీక దామోదరుడికి నెయ్యిదీపంతో ఆరాధన చెయ్యడం, ప్రతిరోజు కొంచెం పాలని నైవేద్యంగా పెట్టడం, వీలనైంత సేపు కృష్ణ నామాన్ని జపించటం ద్వారా ఎన్నో జన్మలనుంచి అనుభవిస్తున్న దారిద్యం నశించి, సుఖ, సంతోషాలు, భోగభాగ్యాలని విశేషంగా అనుగ్రహిస్తాడు కృష్ణభగవానుడు.
కార్తీకమాసం ఎంతో పుణ్యప్రదమైన మాసం. మార్గశీర్ష మాసం తర్వాత అంత గొప్ప నెల ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే. దక్షణాయనంలో ఈ రెండు నెలలు పక్కపక్కనే వస్తాయి. ఈ రెండు నెలలో చేసే పూజలకు, దానాలకి ఎంతో గొప్ప ఫలితం ఉంటుంది. అంత గొప్పదైన ఈ కార్తీకమాసానికి అధిదేవుడు దామోదరుడు. అంటే తాడుచేత ఉదరమునకు (పొట్ట) కట్టబడిన కృష్ణుడు.
*దామోదర లీల*
కార్తీకమాసంలో ప్రతిరోజూ దామోదరలీలను, దామోదర అష్టకాన్ని పారాయణ చేయమంటారు పెద్ధలు. భాగవతంలో ఇది ఒక గొప్ప లీల. చిన్ని కృష్ణుడు వెన్న దొంగతనం చేస్తున్నాడని తల్లి యశోద, కృష్ణుడిని ఒకతాడుతో రోటికి కట్టాలని చూస్తుంది. కానీ తాడు సరిపోదు. మళ్ళీ కొంచెం పెద్ద తాడు కడుతుంది. అయినా సరిపోదు. ఆలా ఎంత తాడు తీసుకొచ్చిన అయన మాత్రం కట్టుబడట్లేదు. సమస్త బ్రహ్మాండాలు అయన కడుపులోనే ఉన్నాయని తెలియని ఆ గోపస్త్రీ అయన పరమాత్మ అన్న విషయం తెలియక ఆయన్ని కట్టేయాలని చూస్తుంది. చివరికి అమ్మ అవస్థని చూసిన భగవానుడు, ఆమె ప్రేమకి లొంగి ఒక రోటికి బంధింపబడ్డాడు.
ఈ లీల జరుగుతుంటే చతుర్ముఖ బ్రహ్మగారు, పార్వతీ సహితుడైన పరమశివుడు, 33 కోట్లమంది దేవతలు, ఋషులు ప్రచ్ఛన్న వేశాలలో నందుడి ఇంటి చుట్టూ తిరుగుతూ చూస్తున్నారు. ఈ కంటికి కనపడని పరమాత్మ, ఒక జాతకర్మ అంటే తెలియనివాడు, అండ, పిండ, బ్రహ్మాండాలను సృష్టించిన పరాత్పరుడు భక్తికి లొంగి ఒక ప్రాకృత బాలుడు వలె అమ్మకి బయపడుతున్నవాడిలా నటిస్తున్న కృష్ణపరమాత్మని ఒక రోటికి బంధించింది. వేదాలకు దొరకనివాడు, లక్ష్మీదేవి కౌగిటికి దొరకనివాడు, యోగుల మనస్సులకు దొరకనివాడు, ఈరోజు తల్లిప్రేమకు బంధీ అయ్యాడని, లోకంలో ఎవ్వరికీ ఇటువంటి వరాన్ని ఇవ్వనివాడు కేవలం ఈ గోపాలవనితకి ఇచ్చాడని దేవతలంతా ముక్కున వేలేసుకున్నారు. ఆలా రోటికి కట్టబడిన బాలకృష్ణుడు, రోటీని లాక్కుంటూ, లాక్కుంటూ ఎప్పటినుంచో నారదుని యొక్క శాపానికి గురై రెండు మద్ది చెట్లుగా పడి ఉన్న కుబేరుడి యొక్క కుమారుల శాప విమోచనం గావించి వారికి తిరిగి పునర్వైభవాన్ని అనుగ్రహించాడు బాలకృష్ణుడు. అటువంటి ఇంత గొప్ప లీల ఈ కార్తీక మాసంలోనే చేసాడు పరమాత్మ. ఇప్పటికీ సమాధి స్థితిలో ఉన్న మహాయోగులు, పీఠాధిపతులు సైతం ఈ లీలని ధ్యానం చేస్తూ ఉంటారు.
భాగవతంలో చెప్పబడిన ఇంతగొప్ప లీలని కార్తీకమాసమంతా పారాయణ చెయ్యడం, కార్తీక దామోదరుడికి నెయ్యిదీపంతో ఆరాధన చెయ్యడం, ప్రతిరోజు కొంచెం పాలని నైవేద్యంగా పెట్టడం, వీలనైంత సేపు కృష్ణ నామాన్ని జపించటం ద్వారా ఎన్నో జన్మలనుంచి అనుభవిస్తున్న దారిద్యం నశించి, సుఖ, సంతోషాలు, భోగభాగ్యాలని విశేషంగా అనుగ్రహిస్తాడు కృష్ణభగవానుడు.






No comments:
Post a Comment